సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ల లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా పనులు పూర్తి అవ్వగానే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా మొదలు కానున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి.

అయితే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నా వీరిద్దరి కాంబినేషన్ సినిమా మాత్రం ఇప్పటికి ప్రారంభం కాలేదు. ఇలా ఈ సినిమా ప్రారంభం కాకపోవడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమా కథ పై ఇంకాస్త ఫోకస్ పెట్టడమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ గా పూజా హెగ్డే కన్ఫామ్ అయ్యింది. అలాగే ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూర్చబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ల్ మహేష్ బాబు తండ్రిగా ఒక సూపర్ పాత్ర ఉందని , ఆ పాత్రలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నాడు అని గతంలో అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్రలో అనిల్ కపూర్ నటించడం లేదు అని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో కన్నడ స్టార్ హీరో అయినా ఉపేంద్ర నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది అని, మహేష్ బాబు కు మరియు ఉపేంద్ర కు మధ్య సన్నివేశాలు ఏమీ ఉండవు అని కూడా తెలుస్తోంది. ఇది వరకే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర ఒక కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా ద్వారా ఉపేంద్ర క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింతగా పెరిగింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: