విశ్వనటుడు కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ పూర్తిగా తన కెరియర్ పై శ్రద్ధపెట్టి ఉంటే ఈపాటికే ఆమె ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ లో ఉండేది. అయితే ఆమె తనకు తానుగా తన జీవితం పై అనేక ప్రయోగాలు చేసుకుంది.


మధ్యలో డేటింగ్ వ్యవహారాలూ ఆతరువాత పెళ్ళి వరకు వెళ్ళి బ్రేకప్ చెప్పుకోవడం అలా ఏర్పడిన టెన్షన్ లతో కొన్ని అలవాట్లకు లోనవ్వడంతో ఆమె కెరియర్ గాడి తప్పింది. కేవలం నటిగా మాత్రమే కాకుండా గాయని గా పొయట్ గా ఫోటోగ్రాఫర్ గా ఫ్యాషన్ డిజైనర్ గా ఇలా ఆమె ఎన్నో అవతారాలు ఎత్తింది. జీవితంలో అనేక ఆటుపోట్లు చూసిన తరువాత ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని వరసగా సినిమాలు చేస్తోంది.


సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ తన వ్యక్తిగత జీవితం గురించి చాలావరకు నిజాలే చెపుతుంది. ఈమధ్య గత కొంతకాలంగా ఆమెకు ఒక అనారోగ్య సమస్య ఏర్పడిందట. ఆసమస్య వల్ల తన యాక్టివ్ లైఫ్ కి ఎంతో ఇబ్బందిగా మారింది అంటూ ఆ విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం తాను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. ఎండోమెట్రియోసిస్ వంటి పలు హార్మోన్ సమస్యలను ఎదుర్కుంటున్నట్లుగా వివరిస్తూ వాటి వల్ల జీవక్రియ సరిగా ఉండక పోవడంతో తన కడుపు ఎప్పుడు ఉబ్బరంగా ఉంటుందని అది తనకు చాల అసౌకర్యంగా మారిందని వివరించింది.


ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కేవలం మందులు వాడితే సరిపోదనీ కనీసం గంటసేపు యోగా చేస్తూ వర్కౌట్ చేయాలని చెపుతూ ఆవివరాలను తన ఇన్ ష్టా గ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. కేవలం యోగా చేస్తే సరిపోదని మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకుంటూ రోజంతా ఉండగలిగినప్పుడు మాత్రమే ఈ సమస్య తీరుతుందని చెపుతూ తన లానే అందర్నీ యోగా చేస్తూ వర్కౌట్ చేయమని చెపుతోంది శృతి హాసన్..






మరింత సమాచారం తెలుసుకోండి: