డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో సలార్ మూవీ ఒకటి. ఈ సినిమాకు కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , ఈ సినిమాకు రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ , ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం లోకి వెళితే... ప్రభాస్సినిమా షూటింగ్ లో ఉన్న షూటింగ్ స్పాట్ లో ఉన్న వారందరికీ మంచి భోజనాన్ని తినిపిస్తాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది తనతో నటించిన నటీనటులు, టెక్నీషియన్ లు ప్రభాస్ తినిపించే భోజనం గురించి అనేక సందర్భాల్లో చెప్పిన విషయం కూడా మనకు తెలిసింది.  

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రేమగా ఆప్యాయతగా తినిపించే భోజనం గురించి శృతి హాసన్ మాట్లాడుతూ... ఇది అత్యుత్తమ లక్షణం. ప్రజలకు ఆహారం ఇచ్చే వారికి ఈ ప్రపంచం లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రభాస్ నిజంగా అంత ప్రేమగా ఆహారం ఇస్తాడు. ఇది ప్రభాస్ యొక్క అత్యుత్తమ లక్షణం అని శృతి హాసన్ తాజాగా ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. శృతి హాసన్ ప్రస్తుతం 'సలార్' మూవీ తో పాటు బాలకృష్ణ సరసన ఒక మూవీ లో ,  మెగాస్టార్ చిరంజీవి సరసన ఒక మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: