టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన కొరటాల శివ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరటాల శివ దర్శకుడిగా తన కెరియర్ ని ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో మొదలు పెట్టాడు.

మొదటి సినిమాతోనే కొరటాల శివ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి కూడా మిర్చి సినిమా ద్వారా మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇలా మిర్చి సినిమాతో అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న కొరటాల శివ ఆ తర్వాత వరుస పెట్టి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా వరుసగా నాలుగు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న కొరటాల శివ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. ఇలా ఆచార్య సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర కెరియర్ లో మొట్ట మొదటి సారి అపజయాన్ని ఎదుర్కొన్న కొరటాల శివ తన తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాను కొరటాల శివ పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా వస్తుందా... అని ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: