మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాలో సునీల్ , అంజలి ఇతర కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు అనేక కథనాలు బయటికి వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తున్నట్లు , ఈ సినిమాలోని పాటలను అత్యధిక ఖర్చుతో తెరకెక్కిస్తున్నట్లు అనేక వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇది ఇప ఉంటే తాజాగా ఈ సినిమాలోని 20 నిమిషాల క్లైమాక్స్ సన్నివేశం కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలు విషయం లోకి వెళితే... ఈ మూవీ లోని రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కోసం రామోజీ ఫిలిం లో ప్రత్యేక సెట్ ను వేసినట్లు, అలాగే ఈ ప్రత్యేక సెట్ లోనే రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ను చిత్ర బృందం చిత్రీకరించనున్నట్లు , ఆలాగే రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కోసం ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ని శంకర్ భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: