మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి ఉన్న మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన  లూసిఫర్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా , ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటించబోతోంది. అలాగే ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.  ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించడం సల్మాన్ ఖాన్, నయనతార లాంటి ఫుల్ క్రేజ్ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తూ ఉండటంతో మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రముఖులు కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న గాడ్ ఫాదర్ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.

సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ‘సారేగామా సౌత్’ కైవసం చేసుకుందని సోషల్ మీడియాలో ఓ టాక్ బలంగా నడుస్తోంది.  కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవిమూవీ తో పాటు భోళా శంకర్ , బాబీ దర్శకత్వంలో ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: