నేషనల్ క్రష్ రష్మీక మందన గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభించిన కొత్తలో మలయాళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ స్టార్ హీరోల  సరసన నటించిన రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదలైన పుష్ప సినిమాతో రష్మిక మందన పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. అలాగే కొంత కాలం క్రితం రష్మీక మందన , కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ అనే కోలీవుడ్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది. కాక పోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మీక మందన , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యనిమాల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం యానిమల్ సినిమాలు రష్మీక మందన పాత్రకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

యానిమల్ సినిమాలో రష్మిక మందన న్యూస్ రిపోర్టర్ గా కనిపించబోతున్నట్లు , హీరో పాత్రకు రష్మీక మందన పాత్రకు మధ్య ఒక కనెక్షన్ ఉండబోతున్నట్లు , ఆ కనెక్షన్ రష్మిక మందన పాత్రకు కూడా ఒక సంబంధం ఉండడం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే యానిమల్ చిత్ర బృందం రన్ బీర్ కపూర్ ,  రష్మిక మందన పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: