ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్ల లో ఒకరు రష్మిక మందన్న..ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రష్మిక మందన్న ఇక అక్కడ నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారింది.స్టార్ హీరోల అందరి సరసన నటిస్తుంది. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. నేషనల్‌ క్రష్‌గా పాపులార్‌ అయిన రష్మిక మందన్నా ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో పాగా వేస్తుంది. అక్కడ ఆమెకి పాన్‌ ఇండియా ఆఫర్లు వస్తుండటం విశేషం. `పుష్ప`తో వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా రష్మిక గురించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది..


విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా ఫెమ్ డైరెక్టర్ సందీప్ వంగ తన కొత్త సినిమా 'యానిమల్' ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ‏తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నా క్రేజీ పాత్రతో అలరించనుందట. ఆమె పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఒక న్యూస్ రిపోర్టర్ గా రష్మిక ఈ సినిమాలో కనిపించబోతుంది. హీరో పాత్రకు ఆమె పాత్రకు మధ్య ఒక కనెక్షన్ ఉంటుందని.. ఆ కనెక్షన్ కి ఆమె వృత్తికి కూడా లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రష్మిక - రణబీర్ కపూర్ ల పై కీలక సీన్స్ ను కూడా షూట్ చేశారు. మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది..కథ అందరికి నచ్చినట్లుగా ఉంటుందని అంటున్నారు.


మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ 'యానిమల్‌' సాగనుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోవైపు తన నటనతోనూ ఆకట్టుకుంటుంది రష్మిక. కేవలం అందాలకే పరిమితం కావడం లేదు. అద్భుతమైన నటనతోనూ మెప్పిస్తుంది. నిజానికి నటనతోనే పాపులర్‌ అయ్యింది. `ఛలో`, `గీతగోవిందం`లో ఆమె పాత్రలో అందుకు నిదర్శనం. ఆ తర్వాత మహేష్‌తో `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాల్లో కనిపించి మెప్పించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: