బాహుబలి సినిమాతో దక్షిణాదిలో భారీ చిత్రాలు బాగానే ఊపందుకున్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా పాని నే చిత్రాలు కూడా పిరియాడికల్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. వీడియో పద్యంలో డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు కూడా తెరకెక్కించడం జరుగుతుంది. ప్రముఖ నవల కథ ఆధారంగా కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియిన్ సెల్వన్ అని కదా అంశంతో మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం కూడా రెండు భాగాలలో రాబోతోంది. మద్రాస్ టాకీస్ లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


ఇక ఇందులో చీయాన్ విక్రమ్, రవి కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, రెహమాన్ జయరామ్, సారా అర్జున్ , శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి విక్రమ్ ప్రభు తదితరులు కూడా నటిస్తున్నారు. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఒకేసారి అన్ని భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలు భారీ తారాగణం ఉండడంతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా ఈ చిత్రాన్ని 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఐశ్వర్యరాయ్ దీపారాభినయం కూడా చేస్తోంది.


ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు నెలల ముందుగానే చిత్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన వారిని పరిచయం చేశారు తాజాగా ఈ రోజున విక్రమ్ పాత్ర లుక్ తో పాటు గెటప్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో విక్రమ్ ఇదిత్య కరికాలన్ గా నటిస్తున్నారు. చోళ సామ్రాజ్యంలో అత్యంత వైల్డ్ టైగర్ గా హీరో విక్రమ్ ఈ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించి ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లు హీరో విక్రమ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: