దీప్తి సునైనా ప్రస్తుత కాలం లో ఈ పేరు తెలియని వారు లేరు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. డబ్ స్మాష్ ల ద్వారా గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునైనా బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించింది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సోషల్ మీడియా లో అందరికీ సుపరిచితురాలిగా మారి పోయింది. సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దీప్తి సునైనా అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటించడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.


 ఇటీవలి కాలం లో సోషల్ మీడియా లో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ అభిమానుల తో మాట్లాడుతున్నారు. ఇలా అభిమానుల  తో చిట్ చాట్ చేస్తున్న సమయం లో కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.. చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అటు నెటిజన్ల నుంచి ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ దీప్తి సునైనాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది అని తెలుస్తోంది. దీప్తి సునయన ఇటీవల సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చింది.


 అభిమానులు వింత వింత ప్రశ్నలు అడుగుతున్నా ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది అని  చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ సమయంలో... ఒక అభిమాని నువ్వు ఎప్పుడు చచ్చిపోతావ్ అంటూ ప్రశ్న అడిగాడు. అభిమాని అడిగిన వింత ప్రశ్నకి ఒక్కసారిగా దీప్తి సునైనా షాక్ అయింది. ఇక ఆ తర్వాత వెంటనే ప్రశ్నకు కౌంటర్ గా నువ్వు పోయిన తర్వాత నేను చస్తాను అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆ నేటిజన్ మరో మాట మాట్లాడలేదు అని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: