టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్  ఇంకా నటి పవిత్రా లోకేష్ మధ్య సంబంధం గురించి గత కొద్ది రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరు ఇద్దరూ కూడా సహజీవనం చేస్తున్నారని..ఇక పెళ్లి చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఇటీవల నరేష్ మూడో భార్య అయిన రమ్యా రఘుపతి కూడా తెరపైకి వచ్చి బెంగుళూరులో ఇంటర్వ్యూలు ఇవ్వడంతో.. నరేశ్ ఇంకా పవిత్ర జంట నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.ముఖ్యంగా కన్నడ మీడియాలో పవిత్ర లోకేష్ బంధం గురించి అనేక రకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కొందరు మీడియా ప్రతినిధులు తనను వెంబడిస్తున్నారని పవిత్ర మైసూరులోని వీవీ పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.అలాగే తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని.. ఇంకా తనకు తన మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని సీనియర్ నటి పోలీసులకు తెలిపింది.


అలాగే ఇంతకముందు సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని పవిత్ర లోకేశ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం కూడా తెలిసిందే.ఇకపోతే మళ్ళీ రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై రీసెంట్ గా పవిత్ర లోకేష్ స్పందించింది. నరేష్ మూడో భార్య అని చెప్పే ఒకావిడ తనను చాలా బ్యాడ్ చేయడానికే కన్నడ మీడియాలో మాట్లాడిందని..ఇక ఇది తన మనసును ఎంతగానే బాధపెట్టిందన్నారు పవిత్ర. ఈ విషయంలో తనకు నరేష్ కు అభిమానుల మద్దతు ఖచ్చితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.ఇక రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్లో కూడా అసలు ఎలాంటి వాస్తవం లేదని.. బెంగళూర్ లోని బ్లాక్ మెయిల్ ఛానల్ తో కలసి తనపై వదంతులు  కూడా సృష్టిస్తుందని నరేష్ చెప్పారు. ఇక డబ్బు కోసమే రమ్య బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టిందని.. ఒకప్పుడు హైదరాబాద్ లో ఇలాగే చేసిందని ఇంకా ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా ఈ వ్యవహారం మొదలుపెట్టిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: