ఈ సందర్భంగానే డబల్ మీనింగ్ అంశం తెరపైకి రావడం జరిగింది ఈ క్రమంలో నాగచైతన్య ఈ వాక్యాలు చేయడం సినీ ఇండస్ట్రీల చాలా హార్ట్ టాపిక్ గా మారిపోతుంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఇందులో రాశి ఖన్నా, అవిక గోర్, మాళవిక నాయర్ నటిస్తున్నారు. మనం సినిమా తర్వాత విక్రమ్ నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన ఆయన అభిమానులకు చాలా నమ్మకం ఉన్నది.
ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాగచైతన్య మూడు విభిన్నమైన గేటకులలో కనిపించనున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకులను ఎంచుకోవడం గమనార్హం. ఇక తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా నాగచైతన్య ఈ మధ్యకాలంలో చాలా విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా నాగచైతన్య లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటించారు ఇందులో అమీర్ ఖాన్ స్నేహితుడిగా నటించారు.