మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే  రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రామ్ చరణ్ కొంత కాలం క్రితమే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమృత్ సర్ లో జరుగుతోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేయడం కోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: