కెరీర్ మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దగ్గరగా.. తన కెరీర్ను నడిపిస్తూ వచ్చింది సాయి పల్లవి. అయితే అందాల ఆరబోత చేయకుండానే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సాయి పల్లవి ఎంచుకునే పాత్రలను చూసి ఎంతో మంది ఆమె అభిమానులు గా మారిపోయారు. ఏకంగా సినిమా హీరోలు సైతం సాయిపల్లవి గొప్ప నటి అంటూ ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. విరాటపర్వం సినిమాతో లేడీ పవర్ స్టార్ అంటూ ఒక  ట్యాగ్ కూడా సాయి పల్లవి కి వచ్చేసింది.


 కానీ ఇప్పుడు మాత్రం సాయి పల్లవి తీసుకుంటున్న నిర్ణయాలపై అటు ప్రేక్షకులు మాత్రం మండిపడుతున్నారు అని తెలుస్తోంది. మొన్నటి వరకు  సాయి పల్లవి ఆదరించిన జనం ఇక ఇప్పుడు ఆమెలోని తప్పులను వెతికి తీసేందుకు సిద్ధమవుతున్నారట. దీనికి కారణం రీసెంట్గా సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలే  అన్నది తెలుస్తుంది. ఇటీవలే సాయి పల్లవి ప్రధాన పాత్రలో  వచ్చిన విరాట పర్వం  సినిమా ప్రమోషన్ లో భాగంగా కాశ్మీరీ పండిట్ గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయిన విషయం తెలిసిందే.  సాయి పల్లవి పై ఎంతోమంది విమర్శలు కూడా చేశారు.


 సీనియర్ నటి విజయశాంతి సైతం సాయి పల్లవి మాటలను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలే విరాటపర్వం సినిమా పెద్ద హిట్ కాకపోవడానికి కారణం అయ్యాయి అంటూ చర్చ కూడా జరిగింది. ఇక ఇప్పుడు సాయి పల్లవి గార్గీ అనే ఒక సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదు అని చెప్పాలి. ఈ సినిమాను ఈ నెల 14వ తేదిన విడుదల చేయాలని అనుకుంటున్నారట. కానీ ఇప్పటివరకు ప్రమోషన్ స్టార్ట్ చేయకపోవడం  అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎమోషన్స్ లేకుండా రిలీజ్ అంటే మాత్రం కాస్త కష్టమే అని అంటున్నారు.. తేడా కొడితే సాయిపల్లవి కెరీర్కి పెద్ద దెబ్బ పడుతుందని లేడి పవర్స్టార్ ట్యాగ్ ఊడిపోతుందని  అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: