టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన అక్కినేని అఖిల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ , వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అనేక అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అఖిల్ కు బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందించలేకపోయింది.

ఆ తర్వాత అఖిల్ నటించిన హలో , మిస్టర్ మజ్ను సినిమాలు కూడా వరుసగా బాక్స్ ఆఫీస్  వద్ద బోల్తా కొట్టాయి. అలా వరుస అపజయాలు బాక్సాఫీస్ దగ్గర ఎదురవుతున్న సమయం లోనే అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో కెరీర్ లో మొదటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న అఖిల్ ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు హిప్ హప్ తామీజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయం లోకి వెళితే... ఈ సినిమాకు 70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పోస్టర్ లు తప్ప పెద్దగా  ఎలాంటి అప్డేట్ లను చిత్ర బృందం విడుదల చేయలేదు, అయినప్పటికీ ఈ సినిమాకు 70 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు.  మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: