టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నా అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.  

సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా,  ఈ మూవీ లో మలయాళం ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు ఆయన ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.  రావు రమేష్ , సునీల్ , అనసూయమూవీ లో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా,  మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించారు. ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ ఐటెం సాంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించింది.  ఇలా పుష్ప ది రైస్ సినిమా మంచి విజయాన్ని పాన్ ఇండియా రేంజ్ లో సాధించడంతో ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా పుష్ప ది రూల్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. పుష్ప ది రిసె మూవీ కంటే పుష్ప ది రూల్ మూవీ పై భారీ బడ్జెట్ ను కూడా పెట్టి ఉద్దేశంతో చిత్ర మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో పుష్ప ది రైస్ సినిమా విడుదల అయ్యింది. పుష్ప ది రైస్ మూవీ విడుదలై ఇప్పటికి ఆరు నెలలు గడిచినా కూడా పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. దానికి ప్రధాన కారణం ఈ సినిమా స్క్రిప్ట్ ను దర్శకుడు సుకుమార్ మరింత బలంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ ఆగస్ట్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: