మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , నయనతార , సత్యదేవ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమా తో పాటు చిరంజీవి , మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలలో గాడ్ ఫాదర్ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాను 2023 సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.  చిరంజీవి ఇలా దసరా మరియు సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు తన సినిమాలను విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా అంటే ఇలా మూడు సినిమాలు సెట్స్ పై ఉండగానే చిరంజీవి , వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి ఇప్పటికే కమిట్ అయి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: