టాలీవుడ్ ఇండస్ట్రీ లో విలక్షణమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గమ్యం మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన క్రిష్ జాగర్లమూడి మొదటి సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుని దర్శకుడిగా మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత ఈ దర్శకుడు వేదం ,  కృష్ణం వందే జగద్గురుం , గౌతమీపుత్ర శాతకర్ణి , ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు , కొండపొలం అలాగే హిందీ లో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి,  పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా పూర్తి కాగానే క్రిష్ జాగర్లమూడి 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఒక వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్ జాగర్లమూడి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఒక వేశ్య చుట్టూ తిరిగే లేడి ఓరియెంటెడ్ కథతో వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన వేదం సినిమాలో అనుష్క పాత్ర కూడా వేశ్య పాత్రే అనడం విశేషం. ఇప్పటివరకు క్రిష్ జాగర్లమూడి 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో ఎ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: