RRR వంటి సినిమాతో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు రామ్ చరణ్. ఇక దీంతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. తాజాగా శంకర డైరెక్షన్లో తన తదుపరి సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కథానాయకగా నటిస్తున్నది. రామ్ చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావడంతో ఈ సినిమాకి టైటిల్ గా RC -15 పెట్టడం జరిగింది. గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50% పైగా చిత్రీకరణ పూర్తి చేయడం జరిగింది.


ఇక మిగిలిన భాగాన్ని కూడా చిత్ర బంధం శరవేగంగా షూటింగ్లో చేస్తున్నారు ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది అదేమిటంటే.. రామ్ చరణ్ ఎంట్రీన్ని శంకర్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసినట్లుగా సమాచారం హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ లో అందుకు సంబంధించి ఒక భారీ చెట్టును కూడా ఏర్పాటు చేశారట ఈ సెట్లో రాంచరణ్ ఇంట్రెస్టింగ్ షూటింగ్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఎంట్రీ కోసం చిత్ర బృందం రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లుగా సమాచారం.


మరి ఈ విషయం నిజమో కాదో తెలియదు కానీ ఈ విషయం మాత్రం నెట్టింట వైరల్ గా మారుతోంది. కాగా ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ ,అంజలి , నవీన్ చంద్ర తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మొదటిసారిగా రామ్ చరణ్ శ్రీపాత్రాభినయంలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇందులో మూడు వేరు వేరు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: