ఇలా డీజే టిల్లు సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా డీజే టిల్లు 2 సినిమాను తెరకెక్కించబోతున్నారు . డీజే టిల్లు 2 మూవీ కి సిద్ధు జొన్నలగడ్డ కథ మరియు డైలాగ్ లను కూడా అందించబోతున్నారు . అలాగే ఈ సినిమా విషయంలో సిద్ధు జొన్నల గడ్డ మరో అడుగు ముందుకు వేసి ఈ సినిమా కోసం మెగా ఫోన్ కూడా పట్టబోతున్నట్లు తెలుస్తుంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఒక కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది . డీజే టిల్లు 2 సినిమాలో హీరోయిన్ మారబోతున్నట్లు తెలుస్తోంది . డీజే టిల్లు మొదటి భాగంలో అద్భుతమైన నటనతో సినిమా విజయం లో కీలక పాత్రను పోషించిన నేహా శెట్టి 'డీజే టిల్లు 2' సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాట్లు తెలుస్తుంది .
ఈ సినిమా కథ విషయంలో ఇదే కీలకమైన మార్పు అని సమాచారం . ఇది ఇలా ఉంటే డీజే టిల్లు రెండో భాగం లో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకులాటను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది . మొదటి భాగం లోని కొన్ని పాత్రలు రెండవ భాగంలో కూడా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.