టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. రాజమౌళి సినిమా టేకింగ్ త్రివిక్రమ్ వ్రాసిన డైలాగ్స్ నచ్చని తెలుగువాడు ఉండడు. అలాంటి త్రివిక్రమ్ ‘అల వైకుంఠ పురములో’ మూవీ తరువాత మరొక సినిమాను తీయడానికి ఎందుకు ఆలస్యం అవుతోంది అంటూ అతడి అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు.



వాస్తవానికి కరోనా పరిస్థితులు ప్రారంభం కాకముందు విడుదలైన ‘అల వైకుంఠ పురములో’ ఇండస్ట్రీ రికార్డ్స్ ను క్రియేట్ చేయడంతో త్రివిక్రమ్ నుండి వరసపెట్టి సినిమాలు వస్తాయని అతడి అభిమానులు భావించారు. అయితే జరిగింది వేరు. జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయాలి అనుకున్న మూవీ క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ తో సినిమాను తీయడానికి రెడీ అవుతూ మహేష్ కు కథ చెప్పే విషయంలో త్రివిక్రమ్ అనుసరిస్తున్న పద్ధతి త్రివిక్రమ్ అభిమానులకు అసహనం కలిగిస్తున్నట్లు టాక్.



మహేష్ గతంలో నటించిన అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ ఆతరువాత మహేష్ నటించిన పరుశు రామ్ ‘సర్కారు వారి పాట’ సినిమాల కథలను మహేష్ కేవలం ఒకేఒక్క సింగిల్ సిటింగ్ లో ఓకె చేసాడు అన్నవార్తలు ఉన్నాయి. అలాంటి మహేష్ త్రివిక్రమ్ తో నటించే సినిమా కథ విషయంలో ఎందుకు ఇన్నిసార్లు చర్చలు జరుపుతున్నాడు అంటూ త్రివిక్రమ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.



ఆమధ్య మహేష్ యూరప్ హాలిడే ట్రిప్ లో ఉంటే అక్కడకు వెళ్ళి త్రివిక్రమ్ మహేష్ కు కథ వినిపించాడని వార్తలు వచ్చాయి. ఆతరువాత మళ్ళీ మహేష్ హాలిడే ట్రిప్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడకు కూడ త్రివిక్రమ్ వెళ్ళి తాను కథలో చేసిన మార్పులు చేర్పులు మహేష్ కు వినిపించాడట. ఇప్పటికి కూడ త్రివిక్రమ్ మహేష్ ల మూవీ ప్రాజెక్ట్ కథ ఫైనల్ అయిందా లేదా అన్న విషయం పై భిన్న కథనాలు వస్తున్నాయి. దీనితో అనీల్ రావిపూడి పరుశు రామ్ లను పూర్తిగా నమ్మిన మహేష్ త్రివిక్రమ్ ను పూర్తిగా నమ్మలేకపోతున్నాడా కొందరి కామెంట్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: