అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ బాట పట్టాడు. అంతకుముందు ఆయన చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో అక్కినేని అభిమానులు తీవ్ర కలవడానికి గురయ్యారు. ఎప్పుడైతే ఈ నాలుగో సినిమా విజయాన్ని అందుకుందో అప్పటినుంచి వారిలో కూడా జోష్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే అఖిల్ ఐదవ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏజెంట్ సినిమాపై వారు మంచి అంచనాలను కలిగి ఉన్నారు.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు యాక్షన్ సినిమాలను చేయడం లో తనకు తాను సాటి అనిపించుకున్న సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సైరా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ చిత్రంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలనే కసితో ఈ చిత్రం చేస్తున్నాడు అందుకే ఈ సినిమాలో ఆయన కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. 

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసే విధంగా గతంలో చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా యొక్క రిలీజ్ మారినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీని ఆగస్టు లో కాకుండా డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారట. వాస్తవానికి పోయిన ఏడాది డిసెంబర్లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా దాన్ని ఆగస్టు కు మార్చారు. ఇప్పుడు ఈ ఆగస్టు ను కాస్త డిసెంబర్ కి వాయిదా వేశారు. 

ఇది అక్కినేని అభిమానులను నిరాశ పరుస్తుంది. ఎందుకని చిత్ర బృందం ఆగస్టులో కాకుండా డిసెంబర్  ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తుందో తెలియదు కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వారు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఆగస్టు లో పెద్ద సినిమాలు ఉన్న కారణం గానే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇకపోతే ఈ సినిమా యొక్క టీజర్ ను త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. దాదాపు 70 కోట్ల వరకు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా అక్కినేని అభిమానులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: