అక్కినేని
అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో
సక్సెస్ బాట పట్టాడు. అంతకుముందు ఆయన చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో అక్కినేని అభిమానులు తీవ్ర కలవడానికి గురయ్యారు. ఎప్పుడైతే ఈ నాలుగో
సినిమా విజయాన్ని అందుకుందో అప్పటినుంచి వారిలో కూడా
జోష్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే
అఖిల్ ఐదవ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏజెంట్ సినిమాపై వారు మంచి అంచనాలను కలిగి ఉన్నారు.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు యాక్షన్ సినిమాలను చేయడం లో తనకు తాను సాటి అనిపించుకున్న
సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన
సైరా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ చిత్రంతో ఎలాగైనా
బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలనే కసితో ఈ చిత్రం చేస్తున్నాడు అందుకే ఈ సినిమాలో ఆయన కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
మలయాళ స్టార్
హీరో మమ్ముట్టి నటిస్తున్న ఈ
మూవీ షూటింగ్ దశలో ఉండగా
సాక్షి వైద్య
హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసే విధంగా గతంలో చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ
సినిమా యొక్క రిలీజ్ మారినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీని ఆగస్టు లో కాకుండా డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారట. వాస్తవానికి పోయిన ఏడాది డిసెంబర్లోనే ఈ
సినిమా విడుదల కావాల్సి ఉండగా దాన్ని ఆగస్టు కు మార్చారు. ఇప్పుడు ఈ ఆగస్టు ను కాస్త
డిసెంబర్ కి వాయిదా వేశారు.
ఇది అక్కినేని అభిమానులను నిరాశ పరుస్తుంది. ఎందుకని చిత్ర బృందం ఆగస్టులో కాకుండా
డిసెంబర్ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తుందో తెలియదు కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వారు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఆగస్టు లో పెద్ద సినిమాలు ఉన్న కారణం గానే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇకపోతే ఈ
సినిమా యొక్క టీజర్ ను త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. దాదాపు 70 కోట్ల వరకు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్
సినిమా అక్కినేని అభిమానులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.