సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా ఉండడమే కాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు మంచి రెస్పాన్స్ లభిస్తూనే ఉన్నది. ఇక తాజాగా నిన్నటి రోజున ఐశ్వర్యారాయ్ సంబంధించి ఒక పోస్టర్ను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటిస్తున్న కార్తి, విక్రమ్, జయం రవి వంటి పాత్రలకు సంబంధించి కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేయడం జరిగింది.



ఈ సినిమాని మద్రాస్ టాకీస్ ,లైక్ ప్రొడక్షన్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటున్నది. ఈ సినిమా సెప్టెంబర్ 30న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్లలో భాగంగా చిత్ర బంధం నుండి వరుస అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా హీరోయిన్ త్రిష పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు విడుదలైన పోస్టర్ లో త్రిష అందాల యువరాణిక రాయల్టీ లుక్ లో చాలా సింపుల్ గా అందంగా కనిపిస్తోంది.


పురుషుల ప్రపంచంలో ధైర్యం ఉన్న ఒక స్రి యువరాణి కుందవై అంటూ ఈమే పాత్ర ను పరిచయం చేయడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హిందీ ఇలా అన్ని భాషలలో కూడా ఒకేసారి విడుదలకాబోతుంది. ఇక ఈ సినిమాల ప్రతికారం తీర్చుకునే నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ కనిపించగా ఇప్పుడు తాజాగా త్రిష ఫోటోని చిత్ర బృందం ప్రకటించి మరింత హైపుని పెంచేస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఎంత అప్డేట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ సినిమా కి బజ్ ఏర్పడడం లేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: