జబర్దస్త్ నుంచి జడ్జ్ గా రోజా బయటకు వచ్చాక ఇంద్రజ ఆ ప్లేస్ లో వచ్చిన విషయం తెలిసిందే. నాగబాబు జడ్జ్ గా తప్పుకున్నాయక ఆయన ప్లేస్ లో మేల్ జడ్జ్ లను ఒకరిద్దరిని ట్రై చేసి ఫైనల్ గా మనుకి ఫిక్స్ అయ్యారు. జబర్దస్త్ జడ్జ్ గా మను పర్ఫెక్ట్ అని వచ్చిన కొద్దిరోజులకే అనిపించుకున్నారు. ఇక రోజా ప్లేస్ లో కూడా ఎవరెవరినో ప్రయత్నించి ఫైనల్ గా ఇంద్రజ దగ్గర ఆగారు మల్లెమాల టీం.

అయితే జబర్దస్త్ షో కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ షో గా కొనసాగుతున్న కారణంగా జడ్జ్ గా ఇంద్రజ ఆ సీటు ని పర్మినెంట్ చేసుకోవాలని చూస్తుంది. అందుకే అందరి టీం లకు మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తూ.. అందరికి మంచి మార్కులు ఇస్తుంది. అంతేకాదు స్కిట్ పూర్తయ్యాక అందరిని మెచ్చుకుంటూ తన ఫీడ్ బ్యాక్ ఇస్తుంది. కొన్ని స్కిట్స్ కి అయితే ఆమె తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేక బరస్ట్ అయిపోతుంది.

మొత్తానికి రోజా ప్లేస్ లో ఇంద్రజ దాదాపు ఫిక్స్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. కేవలం జబర్దస్త్ లోనే కాదు ఇంద్రజని శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం కూడా వాడేస్తున్నారు. జబర్దస్త్ కన్నా ముందు ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కోసమే ముందు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ రోజా ఎగ్జిట్ అవడంతో ఆమెని జబర్దస్త్ కి షిఫ్ట్ చేశారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునేందుకు ఇంద్రజ ప్రయత్నిస్తుంది.

జబర్దస్త్ అనేది ఎప్పుడూ ఉండే షో.. టీం లు మారుతాయి.. యాంకర్లు.. కమెడియన్స్ మారినా సరే జడ్జ్ ల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. మరి ఇంద్రజ, మను లు కొన్నాళ్లు తమ జడ్జ్ మెంట్ కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. ఇంద్రజ మాత్రం ఈ ఛాన్స్ ని బాగా వినియోగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: