టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. సోగ్గాడే చిన్నినాయన మూవీ కి సీక్వెల్ గా బంగార్రాజు మూవీ తెరకెక్కింది. బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్  కలెక్షన్ లను కూడా అందుకుంది.

ఇలా బంగార్రాజు సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చందమామ కథలు , గుంటూరు టాకీస్,  గరుడ వేగ మూవీ లకు దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను జూలై 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' లో విడుదల చేయనున్నారు అంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ వార్తలపై స్పందించిన చిత్ర బృందం ఆ వార్తలు అన్నీ రూమర్లే అని , ది ఘోస్ట్ మూవీ ని మొదట థియేటర్ లలోనే విడుదల కాబోతుంది అని, ఆ తర్వాతే 'ఓ టి టి' లోకి రాబోతుంది అని చిత్ర బృందం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ది ఘోస్ట్ మూవీ నుండి చిత్ర బృందం నాగార్జున కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా, ఆ పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: