తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఉన్నా సరైన కథలను ఎంచుకోలేక చాలా సినిమాలు ప్లేఆఫ్ లుగా మిగిలిపోయాయి. అయితే శంకర్ తో కలిసిన తర్వాత ఇతనికి సరైన బ్లాక్ బస్టర్ పడింది. అపరిచితుడు సినిమా ద్వారా తనకు అప్పటి వరకు ఉన్న క్రేజ్ రెట్టింపయింది. దానితో ఆ సినిమా నుండి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమాలకు దూరంగా ఉండకుండా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో విక్రమ్ నుండి మహాన్ అనే సినిమా కూడా విడుదలైంది. స్టోరీ లైన్ బాగున్నా ఎక్కువగా తమిళ వాసనలు ఉండడంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.

ఇదిలా ఉంటే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం విక్రమ్ కు గుండె పోటు వచ్చినట్లు తెలుస్తోంది. దానితో తన కుటుంబ సభ్యులు విక్రమ్ ను వెంటనే దగ్గర్లోని కావేరి హాస్పిటల్ కు తరలించారు. అయితే విక్రమ్ ఇప్పుడు ఐసియు లో చికిత్స తీసుకుంటున్నాడట. ఈ మధ్యనే విక్రమ్ కు 56 సంవత్సరాలు వచ్చాయి. ప్రస్తుతం ఇతడి హెల్త్ బులెటిన్ కోసం ఫ్యాన్స్ మరియు ఫామిలీ మెంబర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వయసు మీద పడుతున్నా ఇంకా సినిమాలు చేస్తున్నాడు విక్రమ్.

ప్రస్తుతం విక్రమ్ మణిరత్నం చేస్తున్న పాన్ ఇండియా మూవీ లో లీడ్ రోల్ లో చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో విక్రమ్ కు జోడీగా మాజీ ప్రపంచ సుందరికి ఐశ్వర్యారాయ్ నటింస్తుండడం గమనార్హం. కాగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చెన్నైలో పొన్నియిన్ సెల్వన్ సినిమా టీజర్ ను లాంచ్ చేయడానికి పూనుకున్నారు. ఇంతలోనే ఇలా జరగడం తో చిత్ర బృందం కూడా నిరాశలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: