విభిన్నమైన చిత్రాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు పొందాడు డైరెక్టర్ మణిరత్నం. తాజాగా తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ ఈ చిత్రం అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది. ఇదే చిత్రంలో స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్యారాయ్ త్రిష స్టార్ హీరోలు జయం రవి, కార్తీక్, విక్రమ్ వంటి వారు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించడం జరుగుతుంది. పదవ శతాబ్దం కాలం నాటి చోళ రాజుల నేపథ్యంలో ఈ సినిమాని అత్యధిక భారీ స్థాయిలో నిర్మించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని కూడా రెండు విభాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ 30న అన్ని భాషలలో ఒకేసారి రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సలహాలు చేస్తున్నారు.


దీంతో ఈ సినిమా టీజర్ ని ఈ రోజున సాయంత్రం తెలుగులో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. నా అభిమాన డైరెక్టర్లలో మణిరత్నం సార్ కూడా ఒకరని తెలిపారు. ఆయన రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ టీచర్ ని విడుదల చేయడం చాలా త్రిలింగ ఉందని తెలిపారు ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని మహేష్ టీజర్ విడుదల చేసేటప్పుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు.


ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. మొదట పడవలు కిరీటాన్ని ఎత్తిచూపుతో ప్రజలకు అభివాదం చేస్తున్న చోళ రాజ సింహాసనం పైకి కత్తి దుస్తూ విక్రమ్ కోట గేట్లు బద్దలు కొట్టుకుంటూ వస్తూ ఉన్న విజువల్స్ బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక జయం రవి కూడా తన సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇక రాజం ఉట్టిపడేలా ఐశ్వర్యారాయ్ త్రిష ఈ టీజర్ లో ఎంతో అద్భుతంగా కనిపించారు. చివరిగా విక్రం పలికిన డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆసక్తి రేపుతోంది.. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారుతొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: