మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు శంకర్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూండగా , అంజలి , సునీల్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నటుడు మరియు దర్శకుడు అయిన ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా , దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా చోట్ల చాలా షెడ్యుల్ లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. శంకర్మూవీ లోని పాటలను , యాక్షన్ సన్నివేశాలను అత్యధిక ఖర్చుతో చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో 15 వీక్ సినిమాగా తెరకెక్కుతోంది. దానితో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ సి 15 అనే పేరుతో జరుపుకుంటోంది. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న శంకర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: