నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్ లో దూసుకెళ్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పాపులర్ అయిన అమ్మడు ఇప్పటికే బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్ హోత్రాతో ఒక సినిమా అమితాబ్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలతో పాటుగా లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ అమ్మడి ఖాతాలో వచ్చి చేరిందని తెలుస్తుంది. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మికని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

శశాంక్ డైరక్షన్ లో తెరకెక్కే ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో రష్మికని సెలెక్ట్ చేసినట్టు టాక్. ఓ పక్క తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది రష్మిక మందన్న. తెలుగు, హిందీలోనే కాదు తమిళంలో కూడా రష్మిక సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే కార్తీతో ఒక సినిమా చేసిన రష్మిక లేటెస్ట్ గా దళపతి విజయ్ వారసుడు సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా తర్వాత అక్కడ మరో సినిమా కూడా డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది.

తెలుగులో పుష్ప సూపర్ హిట్ కాగా పుష్ప 2లో కూడా అమ్మడు కనిపించనుంది. అయితే పుష్ప 2 లో రష్మిక పాత్ర మధ్యలో ఎండ్ అవుతుందని అంటున్నారు. పుష్ప తర్వాత వరుస తమిళ హిందీ ఆఫర్లు అందుకుంటున్న రష్మిక తెలుగులో ఇంకా ఏ సినిమాకు సైన్ చేయలేదు. అయితే ఆమె చేద్దామని అనుకుంటున్నా సరే అమ్మడి డేట్స్ అడ్జెస్ట్ అయ్యేటట్ట్లు లేవని తెలుస్తుంది. బాలీవుడ్ లో చేస్తున్న సౌత్ సినిమాల అవకాశాలను మాత్రం అమ్మడు వదులుకోవట్లేదని తెలుస్తుంది. సో అక్కడ ఇక్కడ అమ్మడు తన నటన తో ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలతో రష్మిక క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: