సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. కొన్నాళ్లుగా సినిమా షూటింగ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి నిర్మాతల నుంచి ఓ స్పెషల్ అప్డేట్ వచ్చింది. మహేష్ త్రివిక్రం మాసివ్, ఎపిక్ మూవీ ఆగష్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఎనౌన్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కూడా 2023 సమ్మర్ అని ఫిక్స్ చేశారు.

మహేష్ మరోసారి సమ్మర్ టార్గెట్ తో వస్తున్నాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా తన సినిమాలను సమ్మర్ లోనే రిలీజ్ చేస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు మహేష్. కొన్ని సినిమాలు మాత్రం సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాయి. త్రివిక్రం తో చేస్తున్న సినిమా మాత్రం 2023 సమ్మర్ లో రిలీఎజ్ ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబో అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఆల్రెడీ ఇద్దరు కలిసి చేసిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కాంబోగా ఈ మూవీ రాబోతుంది. త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మాసివ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారని టాక్. సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం టైటిల్ ఎనౌన్స్ మెంట్ కూడా చేస్తారని అంటున్నారు. అర్జునుడు టైటిల్ తో ఈ సినిమా వస్తుందని టాక్. ఆల్రెడీ మహేష్ గుణశేఖర్ డైరక్షన్ లో అర్జున్ సినిమా చేశారు. మరి మళ్లీ అర్జునుడు టైటిల్ కి ఓకే చెబుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. త్రివిక్రం, మహేష్ కాంబో మూవీలో గ్లామర్ డాల్ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: