RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ కి నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ఏర్పడింది. తుఫాన్ టైం లో ఎంత ఘోర అవమానం పొందాడో అదే చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తన నటనతో బాలీవుడ్ ఆడియెన్స్ చేత శభాష్ అనిపించుకున్నాడు. rrr తర్వాత ఆ సినిమాకు ఏమాత్రం తగ్గని రేంజ్ లో శంకర్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు చరణ్. ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ దాదాపు 60 శాతం పూర్తి చేసుకుంది. డిసెంబర్ కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా డిసెంబర్ లో పూర్తి చేసి 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. చరణ్ సంక్రాంతికి వస్తే మాత్రం తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయడం కన్ ఫర్మ్ అని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ రికార్డులను కొనసాగిస్తూ ఇంకా చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ రికార్డులను దాటేలా శంకర్ చరణ్ సినిమా వస్తుంది.

ఈ సినిమాలో చరణ్ తన లుక్ తో సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. అంతేకాదు సినిమాలో చరణ్ నటన కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. 2.ఓ తర్వాత ఇండియన్ 2 సినిమా మొదలు పెట్టి మధ్యలో ఆపేసిన శంకర్ ఈ సినిమాతో మరోసారి తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా అంచనాలను మించి ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. మరి శంకర్, చరణ్ సినిమా కాంబో మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత రాం చరణ్ వేణు ఊడుగుల డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: