కొన్నాళ్లుగా జబర్దస్త్ లో పనిచేసిన ఆర్పీ ఆ షో నుంచి బయటకు వచ్చేందుకు కారణాలు చెబుతూ మల్లెమాల టీం మీద శ్యాం ప్రసాద్ రెడ్డి మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. అక్కడ జబర్దస్త్ కమెడియన్స్ ని చాలా దారుణంగా చూస్తున్నారని అక్కడ ఫుడ్ కూడా సరిగా బాగోదని కిరాక్ ఆర్పీ చెప్పాడు. అయితే ఆ ఇంటర్వ్యూ జరిగిన రెండు రోజుల్లో ఇప్పుడు జబర్దస్త్ లో కొనసాగుతున్న హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ లు మరో ఇంటర్వ్యూ ఇచ్చారు.

మల్లెమాల టీం మీద శ్యాం ప్రసాద్ రెడ్డి గారి గురించి ఆర్పీ చెప్పినదంతా అబద్ధమని. అక్కడ తమని బాగా చూసుకుంటున్నారని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ ఇద్దరు ఆర్పీ మాట్లాడింది ముమ్మాటికి కరెక్ట్ కాదని. అతను చెప్పినవన్ని అబద్ధాలే అని చెప్పుకొచ్చారు. హైపర్ ఆది అయితే తమకు శ్యాం ప్రసాద్ రెడ్డి గారు పర్సనల్ గా కూడా కావాల్సిన ఎమౌంట్ ఇచ్చారని. ఆయన్ని అలా ఏక వచనంతో పిలవడం కరెక్ట్ కాదని అన్నాడు.

ఇక సుధీర్ జబర్దస్త్ ని వదిలి వెల్లడానికి కారణం వేరే ఛానెల్ మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడమే అని. అంతేతప్ప ఇక్కనుంచి ఎవరిని గెంటేయలేదని అన్నాడు. జబర్దస్త్ లో జరిగేది ఇదే అని ఆర్పీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేస్తే అతను చెప్పినవన్ని అబద్ధాలే జబర్దస్త్ మాకు లైఫ్ ఇచ్చింది దాన్ని అలా అవమాన పరచలేము అని అంటున్నారు హైపర్ ఆది అండ్ ఆటో రాం ప్రసాద్. మరి వీరి లో ఎవరు చెప్పేది నిజం అన్నది తెలియాల్సి ఉంది. ఆర్పీ కామెంట్స్ తో జబర్దస్త్ టీం లో అలజడి మొదలైందని చెప్పొచ్చు. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: