మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిన విషయం మనకు తెలిసిందే.

అందులో భాగంగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొన్ని షెడ్యూల్ లను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ , టీజర్ కానీ ఏమి విడుదల కాకపోయినా శంకర్ ,  రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాపై ఇప్పటికే అనేక మంది భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాకు ఓవర్సీస్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఏకంగా 45 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒక ప్రముఖ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాని సినిమాకు అలాగే ఫస్ట్ లుక్ , టీజర్ కానీ విడుదల కానీ మూవీ కి ఈ రేంజ్ లో క్రేజ్ అంటే మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో అంజలి , సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటించబోతు ఉండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు  ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: