టాలీవుడ్  స్టార్ హీరో నితిన్  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలియంది కాదు.ఇక స్టార్ హీరో నితిన్ త్వరలో మాచెర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే డెబ్యూ డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఆగస్టు 12న థియేటర్లలో సందడి చేయనుంది. పోతే ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేసుకుంది నితిన్ టీం. అంతేకాకుండా నితిన్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.ఇదిలావుంటే ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన నితిన్ టీవీ స్క్రీన్‌పై మెరువబోతున్నాడు.

అయితే  నితిన్ త్వరలోనే సీరియల్స్‌లో నటించబోతున్నాడన్న వార్త హల్ చల్ చేస్తోంది.ఇక  ఇంతకీ ఈ కొత్త డెసిషన్ ఏంటీ అనుకుంటున్నారా..?. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇకపోతే తాజా అప్ డేట్ ప్రకారం పలు పాపులర్ టీవీ సీరియల్స్‌లో నితిన్ అతిథి పాత్రలో కనిపించి.. మాచెర్ల నియోజకవర్గం ప్రమోట్ చేయనున్నాడని ఇన్‌సైడ్ టాక్‌ వినబడుతుంది.అయితే ఈ మూవీలో కృతిశెట్టి , కేథరిన్ థ్రెసా  హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలావుంటే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిహోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

అయితే రాజ్‌కుమార్ ఆకెళ్ల మాచెర్ల నియోజకవర్గం ప్రాజెక్టును సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్ లో మెరువనుంది అన్న విషయం తెలిసిందే.రారా రెడ్డి అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ లో అంజలి తన అందాల ఆరబోతతో ఆడియన్స్ ని ఆకట్టుకోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: