టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఎదగాలని ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఎన్నో కలలు కంటూ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తూ ఉంటుంది. సినిమాల ఎంపిక సరైనదిగా ఉండడంతో పాటు సరైన సమయంలో వారికి సినిమాల హిట్లు దరిచేరితే సదరు ముద్దుగుమ్మకు తప్పకుండా స్టార్ట్ హీరోయిన్ స్టేటస్ దక్కుతు ఉంటుంది. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తున్న కూడా అవి మంచి పేరును తీసుకువస్తున్న కూడా కొన్ని తప్పులు నిర్ణయాల వల్ల అగ్ర హీరోయిన్ గా ఎదగలేక పోతుంది కీర్తి సురేష్.

నేను శైలజ వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది కీర్తి సురేష్. ఆ తర్వాత మహానటి సినిమాతో అగ్ర హీరోయిన్ ల జాబితాలోకి చేరిపోయింది. అయితే ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేయడమే తప్పు అనీ ఒకవైపు ఆమె అభిమానులు చెబుతున్నా కూడా ఆమె పట్టించుకోకుండా ఆ సినిమాలు చేసి వాటి ద్వారా భారీ ఫ్లాప్ లు వేసుకుంది.

ఆ విధంగా మళ్లీ ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తేనే హీరోయిన్ గా ఎక్కువ రోజులు ఉండగలం అని నమ్మి ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమా చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ సినిమా విజయం ఆమెకు భారీ స్థాయిలో ఉపయోగపడిందని చెప్పాలి. అయితే గతంలో ఆమె చేసిన ఓ పొరపాటు ఇప్పుడు బయటకు వినబడుతుంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఈమె ఓ పాత్ర నటించాల్సింది. కానీ ఆ పాత్రకు కీర్తి సురేష్ నో చెప్పడంతో వేరొక హీరోయిన్ తో ఈ సినిమాను పూర్తి చేశారు. ఒకవేళ ఈ సినిమా కనుక చేసి ఉంటే కీర్తి సురేష్ స్థాయి ఇప్పుడు వేరే రేంజ్ లో ఉండేది. ప్రస్తుతం ఆమెకు ఫోకస్ మొత్తం కమర్షియల్ సినిమాలు చేయడం పైనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: