పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు సముద్రఖని దర్శకత్వంలో ఓ చిత్రం తెరక్కుతుంది. ఈ నేపథ్యంలో అంతకుముందు ఆయన ఒప్పుకున్న రెండు సినిమాలను కూడా క్యాన్సల్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు పోతూ ఉండడం జరుగుతుంది. ఇది అభిమానులను నిరాశపరిచిన కూడా ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి.  చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత చేసిన భీమ్లా నాయక్ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ విధంగా  రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేయాలని ఓకే చేశాడు.  అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చారిత్రక సినిమాను కూడా ఆయన ఓకే చేయడానికి ముందుకు వచ్చారు. అయితే చాలా రోజులే అవుతున్నా కూడా ఈ సినిమాలు ఇంకా మొదలు పెట్టలేకపోవడం అసలు ఆ సినిమాలు ఉన్నాయా లేవా అన్నట్లుగా అనుమానాలను వ్యక్తపరిచారు కొంతమంది. 

చివరికి దర్శకులు కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగినా కూడా ఆ సినిమాలను ఆయన ఇంకా మొదలు పెట్టకపోవడం గ్రీన్ సిగల్ ఇవ్వకపోవడం వంటివి జరగడంతో వారు తదుపరి సినిమాలను చేసే విధంగా ముందుకు వెళ్లారు. అందుకే హరీష్ శంకర్ కూడా తన తదుపరి సినిమాను హీరో రామ్ తో చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ విధంగా భవదీయుడు భగత్ సింగ్ సినిమా దాదాపుగా లేదన్న పుకారు సర్కిల్ అవుతుంది. మరి ఇటీవలే వారియర్ ఆడియో ఫంక్షన్ లో కూడా ఈ సినిమా కి సంబంధించిన క్లారిటీ రాగా త్వరలోనే ఈ సినిమా ఉండబోతుంది అని చెప్పవచ్చు. మరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ ఎప్పుడు ఈ సినిమాను మొదలు పెడతాడో చూడాలి. ఇక ఈరోజే విడుదలైన వారియర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది. మంచి ఓపెనింగ్స్ కూడా దక్కుతాయని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: