అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మూవీ ల ద్వారా కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే ఇటు తమిళ్ అటు హిందీ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తూ వస్తోంది.  

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యింది.  గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా రాశి కన్నా మరి కొన్ని రోజుల్లో థాంక్యూ మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించ బోతుంది. ఈ మూవీ లో నాగ చైతన్య హీరోగా నటించగా ఈ మూవీ కి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా దర్శకుడు విక్రమ్ కె కుమార్ అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ రాశి కన్నా పై ప్రశంసల వర్షం కురిపించాడు.  తాజా ఇంటర్వ్యూలో విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ... రాశీ ఖన్నా 'థాంక్యూ' మూవీ లో మెయిన్ హీరోయిన్. రాశి ఖన్నా తన రోల్ ని అద్భుతంగా చేసింది. అంతే కాకుండా ఒక సన్నివేశంలో నాకు కూడా కన్నీళ్లు తెప్పించింది.  అంత సామర్ధ్యం ఉన్న నటి రాశి ఖన్నా అని విక్రమ్ కె కుమార్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: