మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం క్రాక్ మూవీ తో అదిరిపోయే విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. క్రాక్ మూవీ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రవితేజ తన పాత్రతో ఎంతో మందిని అలరించాడు. అలా క్రాక్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న రవితేజ ఆ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించిన ఖిలాడి మూవీ లో హీరోగా నటించాడు. 

మంచి అంచనాల నడుమ విడుదలైన ఖిలాడి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అలా క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రవితేజ ఖిలాడి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.  ఇది ఇలా ఉంటే ఖిలాడి మూవీ అపజయం తర్వాత రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ తో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు. జూలై 29 వ తేదీన రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేయబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే రామారావు ఆన్ డ్యూటీ మూవీ కి 20 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు , 21 కోట్ల టార్గెట్ ఈ మూవీ బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నట్లు  ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే రామారావు ఆన్ డ్యూటీ మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహించగా , దివ్యాంశ కౌశిక్ , రాజిష విజయన్ ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: