మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి' లాంటి ప్లాప్ మూవీ తర్వాత శరత్ మండువ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో రాజిష విజయన్ , దివ్యాంశ కౌశిక్ లు హీరోయిన్ లుగా నటిస్తుండగా, ఈ సినిమాకు సమ్ సి. ఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి  చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా అమాంతం పెంచేలా చేశాయి.  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను జూలై 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జూలై 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు,  ఆ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులు అయిన గోపీచంద్ మలినేని , అనిల్ రావిపూడి , బాబి , త్రినాథరావు నక్కిన ,  సుదీర్ వర్మ ,  వంశీ కృష్ణ నాయుడు ముఖ్య అతిథులుగా రానున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది.

ఇది ఇలా ఉంటే రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు రాత్రి 8 గంటల 01 నిమిషానికి విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: