పూరి జగన్నాథ్ కు
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి పేరు ఉంది. ఇతర దర్శకుల కంటే వెరైటీగా సినిమాలు చేస్తూ వర్సటైల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న
పూరి జగన్నాథ్ ఇప్పుడు లైగర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ
సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా మొదలు పెడుతున్న చిత్ర బృందం ఈ
సినిమా ద్వారా మంచి రికార్డులను సృష్టించాలని భావిస్తుంది.
పాన్
ఇండియా సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు పలు భాషల్లో రాబోతుంది.
అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా తరువాత పూరీ జగన్నాథ్ మళ్లీ
విజయ్ దేవరకొండ తో కలిసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే పూరీ నుంచి భారీ
మాస్ మసాలా
సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది అనేది అభిమానుల ఫీలింగ్.
ఇస్మార్ట్ శంకర్ చిన్న బడ్జెట్ తో తెరకెక్కి పెద్ద విజయాన్ని సాధించినా కూడా
పూరి అభిమానుల ఆకలి తీరలేదని చెప్పాలి.
ఈ నేపథ్యంలో
విజయ్ దేవరకొండతో చేస్తున్న ఈ లైగర్
సినిమా భారీ బడ్జెట్తో పాటు భారీ
మాస్ మసాలా సినిమాగా ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం ద్వారా ఆయన మంచి విజయాన్ని అందుకోవాలని వారు భావిస్తున్నారు. ఇటీవలే ఈ
సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసి మంచి క్రేజ్ సంపాదించుకోగా ఇప్పుడు ఈ
సినిమా నుంచి నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏంటి అని వారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్
మీడియా వేదికగా వారు ఈ
సినిమా యొక్క అప్డేట్ ను తొందరగా వదిలి పెట్టాలని కోరుతున్నారు. ఆగస్టు 25 వ తేదీన ఈ
సినిమా విడుదల కాబోతుంది.