సాధారణంగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా అంటే ఎ.ఆర్.రెహమాన్ ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గానె వ్యవహరించడం జరుగుతుంది. ఎ.ఆర్.


రెహమాన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే చరణ్ శంకర్ కాంబో మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారట.. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంత భారీ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం.


అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా థమన్ మ్యూజిక్ ఉంటుందా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. మ్యూజిక్, బీజీఎం విషయంలో ఫ్యాన్స్ కు ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతోంది. ఈ సినిమాకు బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేలా థమన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో పాటలు అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా దిల్ రాజు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం కూడా రాజీ పడటం లేదని సమాచారం అందుతోంది.


 


చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు. చరణ్ కియారా కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. చరణ్ ఈ సినిమా లో ఐపీఎస్ అధికారిగా, ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.


 


చరణ్ పాత్రలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని రెండు పాత్రల్లో చరణ్ కనిపించనున్నార ని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ తో ఘన విజయాన్ని అందుకున్న చరణ్ కు ఆచార్య సినిమా ఫలితం బాగా షాకిచ్చింది. అయితే శంకర్ సినిమాతో చరణ్ కోరుకున్న విజయం దక్కుతుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: