అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో సినిమా ఎంత పెద్ద భారీ విజయాన్ని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. అలా వైకుంఠపురంలో మూవీ ని గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ, అల్లు అరవింద్ లు కలిసి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.

ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర ను పోషించింది. అలాగే ఈ మూవీ లోని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ ల కొద్దీ వ్యూస్ ను సాధించాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అలా వైకుంఠపురంలో మూవీ ని హిందీ లో రీమేక్ చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాను హిందీ లో షెజాదా పేరుతో రీమేక్ చేస్తున్నట్లు  మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మొదట 4 నవంబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదల తేదీ కు సంబంధించి చిత్ర బృందం మరో కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 10, 2023 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మరి ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: