సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం విడుదల అయిన సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, సముద్ర ఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ కి గీత గోవిందం మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న పరశురామ్ దర్శకత్వం వహించాడు.

ఇలా సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల గా అనగా ఆగస్ట్ నెల నుండి ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ను చక చకా పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత స్పీడ్ గా ముగించి మూవీ ని 2023 సమ్మర్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను 2023 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించనుండగా, పూజా హెగ్డేమూవీ లో కథానాయికగా నటించబోతోంది. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే సినిమా మహేష్ బాబు కు కెరీర్ పరంగా 28వ సినిమా. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా విడుదలై మంచి సక్సెస్ ను సాధించడంతో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఒక్క వెళ్లి ఎంజాయ్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇది ఇలా ఉంటే నెక్స్ట్ వీక్ మరోసారి మహేష్ బాబు విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తన కుమారుడు గౌతంకృష్ణ ని లండన్ లోని ఒక ప్రముఖ కాలేజ్ లో జాయిన్ చేసేందుకు గాను విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.  తిరిగి వచ్చాక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: