అక్కినేని అఖిల్ , వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అఖిల్ ఆ తర్వాత హలో , మిస్టర్ మజ్ను , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి పలు సినిమాలలో హీరోగా నటించాడు. అఖిల్ తన కెరియర్ లో హీరో గా నటించిన మొదటి మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ హీరోకు నిరాశనే మిగిల్చాయి. కొంత కాలం క్రితం విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో అఖిల్ మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఏజెంట్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, హిప్ హాప్ తమిజా ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో మమ్ముట్టి కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే విడుదల చేయగా ఈ మూవీ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్ట్  12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

కాకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడినప్పటికి ఈ మూవీ షూటింగ్ మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దానితో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు అనేక రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: