మోడీని ఎదిరించడంతో కొంతమంది ఈయనను హిందుత్వవాదులు అతడు ఒక హిందూ విరోధిగా పరిగణించడం జరిగింది. సినిమాలతో పాటు తన మనసుకు నచ్చిన పనులను విషయాలను తెలుపుతూ మాట్లాడినందుకు తనపైన ఐటీ తనిఖీలు చేస్తున్నట్లుగా ప్రస్తావించడంతోపాటు తనను అదే పనిగా బెదిరించే వారిని ఆయన తెలియజేశారు. తాను నిజాయితీగా ఉంటానని ఏడాదికి కోటి రూపాయల ఆదాయ పనులు చెల్లిస్తూ ఉన్నారట. అలాంటి ఆయన మీద తాజాగా ఐటి దాడులు జరిగాయని వార్తలు వినిపిస్తున్న దీని గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడడం జరిగింది.
ఐడి దాడులు చేసి ఏం పట్టుకున్నారు బినామీ ఆస్తులు ఏమైనా దొరికాయా అని ఆయన తెలిపారు నా దగ్గర అలాంటివి ఏమీ లేవు కాబట్టి దొరకలేదు వందల కేసుల్లో లోపల వేసి అవకాశం ఉంది కానీ అలా వేయలేకపోతున్నారు అంటే నేను నిజాయితీగా బతుకుతున్నానని అర్థం కదా అని తెలియజేశారు ప్రకాష్ రాజ్. ఇక సోషల్ మీడియాలో కూడా నీ అంతు చూస్తాం నువ్వు పోతావురా అంటారు కానీ.. ఇలాంటి వాళ్లకి ఎంత ఆనందాన్ని ఇస్తాయో తనకు అర్థం కాలేదని తెలిపారు. తను నటించిన సినిమాలు చూడనన్నారు అయినా నా సినిమాలు ఆడుతూనే ఉన్నాయి.. మోడీ హీరోగా నటిస్తే 30 కోట్లు కూడా రావు దీపికా పడుకొన్ సినిమా నిషేధించడం జరిగింది దాదాపుగా 500 వందల కోట్లు వసూలు చేసింది అంటూ తెలియజేశారు.