టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన విక్టరీ వెంకటేష్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే విజయాలను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకొని ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు.

అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విక్టరీ వెంకటేష్ దాదాపు అందరు టాలీవుడ్ స్టార్ హీరోలు సైలెంట్ గా ఉన్న సమయంలో తాను నటించిన నారప్ప ,  దృశ్యం 2 మూవీ లను వరుసగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేసి ప్రేక్షకులను అలరించాడు. అలాగే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఎఫ్ 3 మూవీ తో కూడా వెంకటేష్ ప్రేక్షకులను అలరించాడు.  ఇది ఇలా ఉంటే  విక్టరీ వెంకటేష్ తన అన్న కొడుకు అయినా దగ్గుబాటి రానా తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. అలాగే వెంకటేష్ , సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కభీ ఈద్ కభీ దీవాలి అనే హిందీ సినిమాలో ఒక పాత్ర లో నటించబోతున్నాడు. 

సినిమా షెడ్యూల్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తన తదుపరి మూవీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ తన తదుపరి మూవీ ని జాతి రత్నాలు ఫెమ్ అనుదీప్ కెవీ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ప్రిన్స్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా ప్రిన్స్ మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తర్వాత వెంకటేష్,  అనిదీప్ కెవీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: