పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 'వఖిల్ సబ్' మూవీతో తిరిగి మూవీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత భీమ్లా నాయక్ మూవీ తో పవన్ కళ్యాణ్ మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇలా రీ ఎంట్రీ తర్వాత వరుసగా రెండు విషయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే వఖిల్ సబ్ మరియు భీమ్లా నాయక్ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావడం విశేషం. రీమేక్ సినిమాలతో అదిరిపోయే విజయాలను అందుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో తమిళ్ రీమేక్ మూవీ ని కూడా లైన్ లో పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో నటించబోతుండగా,  ఒరిజినల్ మూవీ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖనిరీమేక్ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కొన్ని రోజుల పాటు హోల్డ్ లో పెట్టనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల పై కాకుండా కేవలం రాజకీయాల పైన దృష్టి పెట్టే ఉద్దేశ్యంలో ఉన్నట్లు, ఆ కారణంతో ఈ రీమేక్ సినిమాను మరికొన్ని రోజులపాటు హోల్డ్ లో పెట్టనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: