దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలలో ఒకరు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న  మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కెరియర్ పరంగా 15 వ సినిమా కావడంతో,  ప్రస్తుతం ఈ సినిమా ఆర్ సి 15 అనే టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటుంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి చాలా షెడ్యూల్ ల షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ క్రేజీ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది . ఆర్ సి 15 మూవీ కొత్త షెడ్యూల్ ఈ నెల చివరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో చిత్ర బృందం రెండు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం . ఈ రెండు భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీ కి హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలను శంకర్ తన గత సినిమాల్లో లాగా భారీ ఖర్చుతో అదిరిపోయే గ్రాండియర్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 

అలాగే శంకర్ , ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ఈ ప్రదేశాలలో కూడా ఈ మూవీ షూటింగ్ ని నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ,  సునీల్ , అంజలి ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: