మెగా ఫ్యామిలీ లో చాలా మంది హీరోలు సినిమాలు చేస్తూనే రాజకీయాలల్లొకి వచ్చిన విషయం తెలిసిందే..అయితే ఎంట్రీ వరకూ బాగుంది కానీ తర్వాత వాళ్ళకు అంతగా కలిసి రాలేదు..అందుకే ఇప్పుడు ఎలాగైనా రాజకీయాల లో రానించాలని విస్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికల్లో పార్టీని నిల బెట్టాలని గట్టి సంకల్పం తో ఉన్నారు. ఇక పోతే రామ్ చరణ్ సినిమా ద్వారా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..రాజకీయ వ్యవస్థలో మార్పులు గురించి తన సినిమాలో చూపించడానికి రెడీ అయ్యారు..


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా వస్తోంది.ఇక ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు శంకర్ తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే శంకర్ చిత్రాల్లో ఖచ్చితంగా సమాజానికి ఓ మెసేజ్ ఉండటం ఆనవాయతీగా వస్తుంది.


అయితే ఈ సినిమాలో కూడా అలాంటి పాయింట్‌తోనే ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడట. కాగా, ఈ సినిమాను ప్రస్తుత రాజకీయాలపై సెటైరిక్‌గా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో చరణ్ ఓ పొలిటికల్ సెటైర్ సాంగ్ కూడా పాడబోతున్నాడట. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను మన కళ్లకు కట్టినట్లుగా ఈ పాటలో చూపించబోతున్నారట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..ఈ సినిమా సక్సెస్ అవుతుందని మెగా అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: