ఏ
సినిమా పరిశ్రమలో అయినా కొంతమంది
హీరోయిన్ లు తమ అభిమాన
హీరో తో నటించాలన్న కోరికను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ విధంగా తెలుగు లో కథానాయకగా ఎదిగేందుకు సిద్ధమైన
కీర్తి సురేష్ ఒక హీరోతో నటించాలన్న కోరికను వ్యక్తపరుస్తుంది. ఆయనే
విజయ్ దేవరకొండ.
నేను శైలజ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత
మహానటి సినిమాతో జాతీయ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించి పాపులారిటీని అందుకుంది.
ఆ విధంగా
కీర్తి సురేష్ తనకు వచ్చిన పాపులారిటీని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యిందనే చెప్పాలి. ఆమె అనుకోకుండా చేసిందో లేదా అనుకుని చేసిందో ఏమో తెలియదు కానీ
కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేసి తనకు వచ్చిన పాపులారిటీని చేజేతులా నాశనం చేసుకుందనే చెప్పా లి. కమర్షియల్
హీరోయిన్ గా ఎదిగిన తర్వాత చేయవలసిన సినిమాలను ముందుగానే చేసి ఆమె తన కెరియర్ గ్రాఫ్ ను తగ్గించుకుంది అలా ఆ తరువాత తన తప్పు తెలుసుకుని కమర్షియల్
హీరోయిన్ గా ఎదిగేందుకు సిద్ధమయ్యింది.
ఇటీవలే మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో
హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల ను తన ఖాతా లో వేసుకుంది. ఆ చిత్రాలు మంచి విజయాలను అందుకుంటే మాత్రం త్వరలోనే నెంబర్ వన్
హీరోయిన్ గా ఆమె ఎదగడం ఖాయం అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆమె
టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో ఎవరితో నటించాలని ప్రశ్నపై మరికొన్ని సమాధానాలు చెప్పింది. ఆ జాబితాలో చాలామంది హీరోలు ఉన్నారు. వారిలో
విజయ్ దేవరకొండ తో కలిసి నటించాలన్న ఆసక్తి ఆమె కనబరుస్తున్నట్లు చెప్పింది. ఇప్పుడు చేస్తున్న సినిమాల తర్వాత
విజయ్ దేవరకొండ ఆమెకు అలాంటి ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.